Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Sand : ఇసుక ర్యాంపులపై అధికారుల దాడులు.. తెప్పలు ధ్వంసం, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్..!

Sand : ఇసుక ర్యాంపులపై అధికారుల దాడులు.. తెప్పలు ధ్వంసం, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఇసుక ర్యాంపుల పై అధికారులు దాడులు చేశారు. మండలం లోని రామచంద్రాపురం ఏటి లో తెప్పల పై ఇసుకను తీసుకొచ్చి… ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు.
మంగళవారం ఇసుక క్వారీల వద్ద కు తహశీల్దార్ వి.వెంకటేశ్వర్లుఆధ్వర్యంలో దాడులు చేశారు. అప్పటి కే ఇసుక ను లోడు చేస్తున్న మూడు ట్రాక్టర్ల ను స్వాధీనం చేసుకున్నారు. తెప్పలను రెవిన్యూ సిబ్బంది ద్వంసం చేశారు. మూడు ట్రాక్టర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. ఈ దాడులో మండల రెవిన్యూ ఇన్సెపెక్టర్లు ఆలస్యం మధు, అల్లం రవికుమార్, జీపీవో లు రామదాసు, బాలరాజు, జానీ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Health Officer : రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా లలితాదేవి..!
-
Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!
-
Curd : ఏ సమయంలో పెరుగు తింటున్నారు.. ఏం జరుగుతుందో తెలుసా..!
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!









