Gold Price : మరోసారి పసిడి షాక్.. పెరిగిన రూ.1700..!
Gold Price : మరోసారి పసిడి షాక్.. పెరిగిన రూ.1700..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ధర భారీగా పెరుగుతుంది. మరోసారి పసిడి ప్రియులకు బంగారం ధర షాక్ తినిపించింది. వరుసగా బంగారం ధరలు పెరగడంతో మహిళల ఆశలు నిరాశలవుతున్నాయి.
కొత్త సంవత్సరంలో తగ్గుతుందనుకున్న బంగారం భారీగా పెరుగుతుంది. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం 1700 రూపాయలు పెరిగింది. శుక్రవారంతో వరుసగా మూడు రోజులు పెరిగి హ్యాట్రిక్ కొట్టిన బంగారం ధర శనివారం మరో 1700 రూపాయలు పెరిగింది.
హైదరాబాదులో 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు శుక్రవారం 7,96,700 రూపాయలు ఉండగా శనివారం 1700 రూపాయలు పెరిగి 7,96,400 లుగా ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర శుక్రవారం 7,28,500 రూపాయలు ఉండగా శనివారం 1500 రూపాయలు పెరిగి 7,30,000 ఉంది.
అదేవిధంగా హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం శనివారం ధర 22 క్యారెట్స్ 73,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 79,640 ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి.
RELEATED NEWS :









