Seethakka : పప్పు, ఉప్మా అంటే విరక్తి.. సీతక్క..!
Seethakka : పప్పు, ఉప్మా అంటే విరక్తి.. సీతక్క..!
మన సాక్షి :
నేను నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. చిన్నప్పటి నుంచి ఇంట్లో పప్పు ఎక్కువగా వండేవారు.. ఆ తర్వాత హాస్టళ్లలో కూడా పప్పు ఎక్కువగా వడ్డించారు.. అజ్ఞాతంలో ఉప్మా తినేవాళ్లం. దీంతో పప్పు భోజనం, ఉప్మా అంటే అసహ్యం కలిగింది’ అని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
12 శాతం హిమోగ్లోబిన్ ఉండాల్సి ఉండగా, ఎప్పుడూ 8 శాతమే ఉండేదన్నారు. ఐదేళ్ల క్రితం తాను కూడా రక్తహీనతతో బాధపడ్డానని, ఇప్పుడు దాని నుంచి కోలుకున్నానని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంటూ ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బుగుప్తా మంచి కార్యక్రమం అమలు చేయడం అభినందనీయమన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరి జన పోషణ మిత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు తమ ఆలోచనలతో ఆడబిడ్డల సంక్షేమానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!
-
Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
-
Ravitheja : రవితేజ ఇక ఆర్పిఎఫ్ అధికారి..?
-
Nalgonda: నల్గొండ జిల్లాలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!
-
మహిళలకు శుభవార్త.. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు..!









