Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!

Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఉగాది పండుగకు ఒకేసారి రెండు శుభవార్తలు తెలియజేసింది. పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హుజూర్నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
ఇది ఇలా ఉండగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేస్తూ బిపిఎల్ కుటుంబాలకు ట్రై కలర్ (మూడు రంగుల) కార్డులు అందజేయనున్నారు. ఐపీఎల్ కుటుంబాల వారికి గ్రీన్ కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.70 కోట్ల మందికి రేషన్ కార్డులుడగా కొత్త రేషన్ కార్డులతో కలిపి 3.10 కోట్ల మంది సన్నబియ్యం పొందనున్నారు.
నిత్యవసర సరుకులు :
తెలంగాణ ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బిపిఎల్ కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా కేవలం సన్నబియ్యమే కాకుండా నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నారు. పప్పులు, ఉప్పు తో పాటు నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
MOST READ :









