Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్లో అవగాహన కార్యక్రమం..!
వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు తెలిపారు.

Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్లో అవగాహన కార్యక్రమం..!
పెన్ పహడ్, మనసాక్షి:
వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని
కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు తెలిపారు.
గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం (రావే)లో భాగంగా ధూపహాడ్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
వివరాలు :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామ రైతు వేదికలో లైలా అకాడమీకి చెందిన బిఎస్సి (వ్యవసాయం) డిగ్రీ విద్యార్థినిలు గ్రామీణ వ్యవసాయ విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్త డి. అదర్స్ మాట్లాడుతూ, గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ (PRA) ద్వారా వ్యవసాయం, నీటి వనరులు, జనాభా, పంటల పరిస్థితులను
విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు.
గ్రామీణ విశ్లేషణ :
విద్యార్థులు గ్రామ పటం, వెన్ డయాగ్రామ్, పై చార్టులు, చిత్రాల రూపంలో గ్రామ వనరులు, రైతుల వర్గీకరణ, నీటి వనరులు, వ్యవసాయ దిగుబడులు, యాజమాన్య పద్ధతులను
రైతులకు వివరించారు.
రైతులకు సూచనలు :
ఒకే పంట సాగు చేయడం వల్ల భూసారం తగ్గి
పంట చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయని తెలిపారు. పంట మార్పిడి విధానం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తే
మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ధూపహాడ్ సర్పంచ్ నన్నెపంగ కమలమ్మ – సైదులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డి. అదర్స్, పి. అక్షిత్ సాయి, కిరణ్,
లైలా వ్యవసాయ విద్యాసంస్థకు చెందిన విద్యార్థినిలు సాత్విక, వంశిక, రుత్విక, నవ్య, అశ్విని, ఫరీనా మరియు రైతు సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.
MOST READ NEWS
-
SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!
-
TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..!
-
Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!
-
Miryalaguda : మిర్యాలగూడలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం..!










