TOP STORIESBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : అట్టహాసంగా తెలుగు రాష్ట్రాల కోలాట పోటీలు ప్రారంభం..!

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాట పోటీలు ప్రారంభమయ్యాయి.  రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి కోలాటం బృందాలు చేరుకున్నాయి.

Suryapet : అట్టహాసంగా తెలుగు రాష్ట్రాల కోలాట పోటీలు ప్రారంభం..!

పెన్ పహాడ్, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాట పోటీలు ప్రారంభమయ్యాయి.  రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి కోలాటం బృందాలు చేరుకున్నాయి.

గురువారం మాజీ సర్పంచ్ బండి రామకృష్ణారెడ్డి కుమారుడు బండి ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు తో కలిసి రెండు రాష్ట్రాల కోలాట పోటీలను ప్రారంభించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలాట పోటీలలో మహిళలు గెలుపు ఓటములను సమానంగా భావించాలని కోలాట పోటీలలో గెలుపొందిన మొదటి బహుమతి 70,000 రూపాయలు మొదటి బహుమతిగా అందిస్తున్న బండి ధనమ్మ రామకృష్ణారెడ్డి కుమారుడు బండి సోమిరెడ్డి బండి ఇంద్రసేనారెడ్డిని పలువురు అభినందించినారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నాతాల వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ సొంటి ఆంజనేయులు, డి సూర్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి వెంకన్న, దేవాలయ జాతర చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి, కుందూరు వెంకట్ రెడ్డి ,ఉప్పల సంయుక్త రామ్ రెడ్డి, బండి రవీందర్ రెడ్డి ,సుధాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, షేక్ ఇమామ్ పాషా, దేవులపల్లి శ్రీహర్ష, పందిరి గోపిరెడ్డి, వెంకన్న, బోళ్ల జానకిరామ్ రెడ్డి,

మండాది పాపయ్య గౌడ్, దూదిపాల యాదగిరి ,బచ్చల కూరి సైదులు, వార్డు నెంబర్స్ చెక్కి వెంకన్న, కుందూరు శిరీష, బచ్చలకూరి శ్రీలత రాంబాబు, నారగాని నాగమణి సైదులు, ఎస్. కె యాకూబ్ ఆలీ, ఎస్. కె మౌలాభి ఉస్మాన్, కుందూరు వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి సునంద రాంరెడ్డి, బండి వినిత కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By : Nageshwar Rao, Penpahad 

ఇవి కూడా చదవండి

  1. KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!

  2. Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

  3. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!

  4. Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

మరిన్ని వార్తలు