Nagarjunasagar : నాగార్జునసాగర్ సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే.. ప్రముఖులు..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే.. ప్రముఖులు..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ డ్యామ్ ను పలువురు ప్రముఖులు సందర్శించారు. నాగార్జునసాగర్ డ్యాం 26 గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు రాష్ట్రస్థాయి ,జిల్లాస్థాయి అధికారులు నాగార్జునసాగర్ ను సందర్శిస్తున్నారు..
దీనిలో భాగంగా శనివారం మిర్యాలగూడ శాసనసభ సభ్యులు బి లక్ష్మారెడ్డి తమ కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్ డ్యామ్ ను సందర్శించారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించారు.
వీరితోపాటు నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, నల్లగొండ నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ , తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్ డ్యాము, బుద్ధవనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ALSO READ :
TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,
Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!









