Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

మిర్యాలగూడ : పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం..!

మిర్యాలగూడ : పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా మిర్యాలగూడ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ పొలగాని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కెక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన ఎన్ ఎస్ యు ఐ నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి శ్రమపడిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించిందన్నారు. కష్టపడ్డ వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెనుదండగా ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డిలీగేట్ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పఈడిమర్రి నరసింహారావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పొదిల శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,

సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్కా రెడ్డి, వేములపల్లి, దామచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంతరెడ్డి, గాజుల శ్రీనివాస్ జిల్లా నాయకులు రావు ఎల్లారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ గంధం రామకృష్ణ,

కాంగ్రెస్ పార్టీ నాయకులు బుసిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చౌగాని వెంకన్న గౌడ్, బి సతీష్ రెడ్డి, పళ్ళ వెంకటయ్య, బంటు రమేష్, అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

మరిన్ని వార్తలు