Breaking Newsతెలంగాణరాజకీయంసంక్షేమం
TS News : ఆగస్టు 15న తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే..!
తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నది.

TS News : ఆగస్టు 15న తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నది. కొత్త పథకాలు ప్రారంభించడంతో పాటు గతంలో అమలు చేస్తున్న పథకాలను విస్తరించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దాంతో పాటు కొత్తగా 2.25 లక్షల మందికి చేయూత పింఛన్లు ప్రారంభించనున్నారు.
అదేవిధంగా ఐదు లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 34 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే పథకం, గిగ్ వర్కర్లకు చట్టపరమైన రక్షణ, సనత్ నగర్ లో టీమ్స్ ప్రారంభం, మూసీ పునరుజీవన ప్రాజెక్టులపై కీలక ప్రకటన, సెప్టెంబర్ లో ఇందిరమ్మ టవర్లకు శంకుస్థాపన, ఈ పథకాలని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు.









