Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : చికెన్ మోమోస్ తిని 50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి..!

Hyderabad : చికెన్ మోమోస్ తిని 50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బంజరా హిల్స్ నందినగర్ లో చికెన్ మోడల్స్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారాంతపు సంతలో చికెన్ మోమోస్ కొనుగోలు చేసి తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 50 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు. కాగా సింగాడికుంటకు చెందిన వివాహిత మహిళ మృతి చెందింది. బాధితులు నగరంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వారాంతపు సొంతలో మోమోస్ తినడం వల్లనే ఈ సంఘటన జరిగినట్లుగా దర్యాప్తు చేపట్టారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు