Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణ

ఏరోస్పేస్ రంగంలో విప్లవం.. బ్లూజే ‘వాంటిస్’ ప్లాట్‌ఫారమ్.. 2027 నాటికి హైడ్రోజన్ విమానాలు!

భారతదేశ లాజిస్టిక్స్ రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు చెందిన బ్లూజే ఏరోస్పేస్ సంస్థ అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది

భారతదేశ లాజిస్టిక్స్ రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు చెందిన బ్లూజే ఏరోస్పేస్ సంస్థ అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. 4 ఏళ్ల పరిశోధనల తర్వాత వాంటిస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేసిన తమ రెండవ కమర్షియల్ గ్రేడ్ విమానం ‘జెన్ #2’ను సంస్థ లాంచ్ చేసింది. విమాన నిర్మాణంలో విడివిడి ఉత్పత్తుల కంటే ఒకే ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి సిరీస్ మోడళ్లను తయారు చేయడంపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. దీనివల్ల విమానాల ఎయిర్‌ఫ్రేమ్, ప్రొపల్షన్, కంట్రోల్స్ అటానమీ వ్యవస్థలు ఒకేలా ఉండి, కొత్త మోడళ్ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ భారీ పేలోడ్ ఏరియల్ లాజిస్టిక్స్ విమానం 200 కేజీల కంటే ఎక్కువ బరువును మోసుకెళ్లడమే కాకుండా, పూర్తిగా బ్యాటరీతో నడుస్తూ కాలుష్య రహిత రవాణాకు బాటలు వేస్తోంది. అయితే బ్లూజే ఏరోస్పేస్ కేవలం బ్యాటరీ విమానాలకే పరిమితం కాకుండా, సుదూర ప్రయాణాల కోసం హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను కూడా వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వెర్షన్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో భాగంగా కంపెనీ సొంతంగా టైప్ 4 కాంపోజిట్ హైడ్రోజన్ ట్యాంక్‌ను కూడా తయారు చేసింది.

హైడ్రోజన్ ఆధారిత విమాన ప్రయాణాన్ని సాకారం చేయడానికి బ్లూజే ఏరోస్పేస్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) సంస్థలతో జతకట్టింది. ఈ సంయుక్త భాగస్వామ్యంతో బలమైన హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించి, 2027 నుండి 2028 మధ్య కాలంలో హైడ్రోజన్-ఎలక్ట్రిక్ లాంగ్-రేంజ్ విమానాలను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. భారతీయ డీప్-టెక్ రంగం అంతర్జాతీయ స్థాయిలో ఏరోస్పేస్ మేధోసంపత్తిని (IP) సృష్టించగలదని ఈ ప్రయోగం నిరూపించిందని ఎండీయూ పార్ట్‌నర్స్ ఐడియాస్ప్రింగ్ క్యాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు