Breaking News : టాప్ 5.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ పోర్టల్ మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల ఫ్లాష్ న్యూస్ మీ ముందు..

Breaking News : టాప్ 5.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ పోర్టల్ మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల ఫ్లాష్ న్యూస్ మీ ముందు..
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం :
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ లలో కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు.
హుజురాబాద్ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ :
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ అయింది. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగింది. హుజురాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు.
శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు :
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు :
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాటికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఊరేగింపులు, సభలను పోలీసులు నిషేధించారు.
అనారోగ్యంతో బీజేపీ అభ్యర్థి మృతి :
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో బిజెపి అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతి చెందింది. బత్తిని ఎల్లమ్మ బిజెపి అభ్యర్థిగా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో పోటీ చేసింది. ఆమె శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది.
ఇవి కూడా చదవండి
-
Doctorate : బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపుపై పరిశోధన.. పుగళరసికి డాక్టరేట్..!
-
పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు..!
-
MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!
-
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!









