Narayanpet : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ..!
Narayanpet : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట పట్టణంలో మొదటి విడుత లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి స్థానిక సివిఆర్ భవన్ లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 33 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులందరూ త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో పక్కా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇండ్ల మంజూరులో కానీ బిల్లు వచ్చినప్పుడు కానీ ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసయ్య, మేనేజర్ అజీమ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి సలీం, నాయకులు మహిమూద్ ఖురేషి, అమీరుద్దీన్, అనిల్, వకీల్ సంతోష్, శారద తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!
-
NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!
-
Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!
-
ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!
-
Power Cut : పేటలో రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!









