Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
NARAYANPET : పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
NARAYANPET : పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
మొక్కలు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మండలం అప్పక్ పల్లి మెడికల్ కాలేజీ దగ్గర వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సూచించారు. వర్షాలు సకాలంలో పడాలంటే మొక్కలు విరివిగా పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!









