Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!
Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!
మనసాక్షి, హైదరాబాద్ :
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పేద ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్నబియ్యం పంపిణీ విషయంపై మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ 2025 జనవరి నుంచి సన్నరకం బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో అత్యంత కీలకమైన సన్న బియ్యం పంపిణీ త్వరలో చేపడుతామన్నారు. సన్న బియ్యం తో పాటు అవసరమైన ప్రాంతాలలో రాయితీ కల్పించి గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1629 డీలర్ల ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలో భర్తీ చేయాలని అధికారులు ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్ చౌహన్ పాల్గొన్నారు.
LATEST UPDATE :
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!









