మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!
మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో 100 అడుగుల జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ పట్టణ నాలుమూలల నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
కాగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన పింగళి వెంకయ్య పుస్తకాన్ని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లతో ఆవిష్కరించారు.
ALSO READ :
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!
MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!
Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!









