TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!
మన సాక్షి, తెలంగాణ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టి ఫైబర్ ను తీసుకొచ్చింది. ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్, ఓటీటీ, రిమోట్ కంప్యూటర్, ఈ గవర్నెన్స్ సేవలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది.
అందుకుగాను స్థానిక కేబుల్ ఆపరేటర్లను భాగస్వామ్యం చేసేందుకు గాను ఆ సంస్థ ఎండి నోటిఫికేషన్ జారీ చేశారు. లోకల్ కేబుల్ ఆపరేటర్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో, మండల, గ్రామీణ ప్రాంతాల్లో టీ ఫైబర్ టెలికాం నెట్వర్క్ ఎక్విప్మెంట్ల నిర్వహణ, వాటి భద్రత, కేబుల్ ఐపి టీవీ, బ్రాడ్బ్యాండ్ ఇతర సేవల కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఎండి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు గాను రెవెన్యూ షేరింగ్ ప్రాతిపరకన సంబంధిత సేవలకు అర్హత, అనుభవం కలిగిన లోకల్ కేబుల్ ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే దీనికి భారీ స్పందన లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
MOST READ NEWS :
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
UPI : యూపీఐ లావాదేవీలపై జిఎస్టి విధింపు పై కేంద్రం క్లారిటీ..!
-
Hyderabad : విల్లాలో తాగుబోతుల రచ్చ.. సెక్యూరిటీ గార్డును చితక్కొట్టారు..!
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
TG News : మూడు నెలలుగా జీతాలేవీ.. బతికేదెట్లా..!









