Nelakondapally : శర వేగంగా చప్టా పనులు..!
Nelakondapally : శర వేగంగా చప్టా పనులు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఇటీవల వరదలకు కొట్టుకపోయిన చెరువు అలుగు చప్టా మరమ్మతులు గురువారం కాంగ్రెస్ డివిజన్ నాయకులు, సోసైటీ మాజీ చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. చప్టా దెబ్బతినటంతో మంగాపురంతండా, వల్లభి, రాయి గూడెం చెరువుమాధారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చోరవ తో అలుగు పనులు ప్రారంభించారు. రహదారి లేక దాదాపు 10 కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని పలు గ్రామాల ప్రజలు వాపోయారు. మా గోడు అర్ధం చేసుకుని మంత్రి సహాకారంతో పనులు చేయిస్తున్నందుకు రుణపడి ఉంటామని ఈవూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు గ్రామాల ప్రజలు సంతోషం. ను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెరువుమాధారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యాక్షుడు దీరావత్ రాధాకృష్ణమూర్తి, రాజారాంపేట చైర్మన్ దీరావత్ బాలాజీ, మార్కెట్ కమిటి డైరెక్టర్లు సూరేపల్లి రవి, సీత్యానాయక్, చీర్ల భాస్కర్, తేజావత్ కోటేశ్వరావు, నాగరాజు, కోటేశ్వరరావు యడవల్లి శ్రీనివాసరావు, చిన్నానాయక్, రామదాసు, తేజావత్తు రమణ, తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!
District collector : 28న గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్..!









