తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లావ్యవసాయం
Peanut Seeds : మొలకత్తని వేరుశనగ విత్తనాలు.. ఆవేదనలో రైతు..!

Peanut Seeds : మొలకత్తని వేరుశనగ విత్తనాలు.. ఆవేదనలో రైతు..!
వెల్దండ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాలు మొలకెత్తక తీవ్ర నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా వున్నాయి వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన చొప్పరి శంకరయ్య అనే రైతు ప్రభుత్వం ఇటీవల మహిళా సంఘంలో భాగంగా తన తల్లి చొప్పరి కృష్ణమ్మ కు, తన భార్యకు ఇద్దరికీ కలిపి 180 కిలోల పంపిణీ చేసిన పల్లి విత్తనాలను పట్టించుకోనగా 110 కిలోలు వచ్చింది.

ఆ వేరుశనగ విత్తనాలను తన పొలంలో వేయగా అవి మొలకెత్తలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాలను తన పొలంలో వేసి ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
-
District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!
-
Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!
-
Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!
-
Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!









