కాలువలో పడి వృద్ధురాలి మృతి..!
కాలువలో పడి వృద్ధురాలి మృతి..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధురాలి మృతి చెందిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్ బుజ్జి (85) ఇటీవల మతిస్థిమితం లేకుండా ఉంది.
మంగళవారం నందిగామ బ్రాంచి కెనాల్ పక్కనే ఉన్న ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. దాదాపు 2 కిలో మీటర్ల కు పైగా కాలువ లో కొట్టుకపోయింది. అక్కడ కాలువ లో ఏపుగా పెరిగిన చెట్లు కు చిక్కుకుని కనిపించింది.
స్థానికులు మృతదేహం ను నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బంధువులు ఫిర్యాదు చేయటంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కు పోస్టుమార్టమ్ నిర్వహించారు.
ALSO READ :
పోలిస్టేషన్ ముందే కారు అద్దాలు పగలగొట్టి చోరీ..!
Manchiryala : లక్షేట్టిపేట్ వాసికి జపాన్ లో అవార్డు..!
Narayanpet : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత..!









