Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం విక్రయించుకునేందుకు వెళ్లిన ఓ రైతుపై రైస్ మిల్లర్స్ యాజమాన్యం దాడులకు దిగింది. దాంతో ఆ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పరిధిలోని సూర్య తేజ రైస్ మిల్లులో దాన్యం విక్రయించుకునేందుకు బాధలాపురం గ్రామానికి చెందిన రైతు శివనేని నాగరాజు వెళ్ళాడు. దాంతో రైస్ మిల్లు యాజమాన్యం, గుమస్తాలు ఆ రైతుతో నివాదానికి దిగి దాడి చేశారు. కాగా నాగరాజు కు తీవ్ర గాయాలయ్యాయి.
కాగా అతనిని పట్టణంలోని బాలాజీ హాస్పిటల్ లో చేర్పించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న రైతు నాగరాజును మంగళవారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.
MOST READ :
-
District SP : పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. కీలక ఆదేశాలు..!
-
Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!









