Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Rythu Bharosa : రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇవి తప్పనిసరి..! 

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం కోసం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని కంగ్టి ఏవో హరీష్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Rythu Bharosa : రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇవి తప్పనిసరి..! 

కంగ్టి, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం కోసం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని కంగ్టి ఏవో హరీష్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంగ్టి మండల పరిధిలోని రైతులు ప్రస్తుత యాసంగి (2025-26) సీజన్ కు సంబంధించి కొత్త అప్లికేషన్లు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం మార్చి 25 లోపు సంబంధిత ఏఈవోలను సంప్రదించాలన్నారు. దరఖాస్తుతో పాటు పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ పుస్తకం, మొబైల్ నంబర్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు