Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!
Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు వారి ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఒక నెటిజన్ ఆర్ టి సి ఎం డి సజ్జనార్ కు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కు ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్లాలా అంటూ పోస్ట్ చేయడంతో ఆయన స్పందించారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఎండి సర్జనార్ మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. ఆధార్ కార్డు మాత్రమే ప్రామాణికం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు కార్డులను చూపించవచ్చునని తెలిపారు. అయితే ఆధార్ కార్డు లేకున్నా ఇతర గుర్తింపు కార్డులను చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చును.
Plz @TSRTC తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో బాగంగా మహిళలకు '0' టికెట్ కోసం ఆధార్ ఉంటే చాల..? ఖచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలా..?
Plz Conform @SajjanarVC Sir
— Mudavath Ramesh Nayak (@RameshMudavath5) May 8, 2025
MOST READ :
-
Bitter guard: కాకరకాయ తింటున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహారాలతో కలిపి తినకండి..!
-
Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!
-
Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!









