Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!

Accident : విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!

మన సాక్షి, హైదరాబాద్ :

విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.

లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికురాలు మృతి చెందారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు