తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Shankarpally : శంకర్‌పల్లిలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాల్టీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ (సిడిఎంఎ) డా. టికే శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

Shankarpally : శంకర్‌పల్లిలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం..!

ప్రారంభించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టికే శ్రీదేవి

శంకర్‌పల్లి, (మన సాక్షి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాల్టీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ (సిడిఎంఎ) డా. టికే శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాలు వంటి అంశాలపై విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామని తెలియజేశారు. రోడ్లపై చెత్త వేయరాదని, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, ప్లాస్టిక్ ను నిర్మూలించాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో శంకర్‌పల్లి పట్టణం జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని ప్రజలకు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కే. ఫల్గుణ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ జూలకంటి శ్వేత పాండురంగ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు దండు రాజేశ్వర్, అశోక్, ఉషాకిరణ్ విజయ్ కుమార్, ఆనంద్ రావు, గణేష్, గిరిజ చంద్రశేఖర్, కమిషనర్ యోగేష్, మేనేజర్ అంజన్ కుమార్, డిఈ యాదయ్య, ఏఈ నరేష్, మెప్మా ఆర్పీలు, పారిశుద్ధ, మున్సిపల్, రెవెన్యూ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు