Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా
Thahasildar : ఎస్సారెస్పీ కాల్వ కింద పంట పొలాలు పరిశీలించిన తహసిల్దార్..!
Thahasildar : ఎస్సారెస్పీ కాల్వ కింద పంట పొలాలు పరిశీలించిన తహసిల్దార్..!
నర్సింహులపేట, మనసాక్షి :
మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం లోని పెద్దనాగారం స్టేజీ సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువను వరి పంట పొలాలను సోమవారం తహశీల్దార్ నాగరాజు, ఏఓ వినయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవలసిన పనిలేదని చివరి ఆయకట్టు వరకు నీరు ఎస్సారెస్పీ ద్వారా వస్తుందన్నారు.
వరిపంట చిరుపొట్ట దశలో ఉన్నదని,నీటిని కాలువల ద్వారా గానీ,పైపుల ద్వారా గానీ, కమతాల వారీగా మడి మడికి నీటిని ఇచ్చుకొని ఎక్కువ నీరు వృధా కాకుండా వరి పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఏఈఓ బాబు,రైతులు గాడ్దుల మధు, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి.. కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశం..!
-
UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!









