తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

వారు 29 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

వారు 29 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

రామగిరి, (మన సాక్షి) :

పెద్దపల్లి జిల్లాలో పూర్వ విద్యార్థులు 29 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు చేసుకున్నారు.

రామగిరి మండలం రాజాపూర్ వందన ఉన్నత పాఠశాల 1995-96 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం సెంటినరీ కాలనీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించడం జరిగింది.

గురువులను ఆత్మీయగా పలకరిస్తూ వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారు నేర్పిన విద్యాబుద్ధులతో ఉన్నత స్థాయికి ఎదగమని విశ్లేషిస్తూ ఆ గురువులను శాలువాలతో సత్కరిస్తూ జ్ఞాపకలను ఇవ్వడం జరిగింది. 29 సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు వారి అనుభవాలను పంచుకుంటూ ఆనందంలో మునిగితేలారు.

పాఠశాల కరస్పాండెంట్ ముడుసు లక్ష్మణ్, ఉపాధ్యాయులు శేఖర్, శంకర్, రాజేందర్, మధు, ధనంజయ్ లక్ష్మణ్ రాజేశం తను సత్కరించడం జరిగింది.

LATEST UPDATE : 

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

నిర్మల్ లో ఘోరం.. వైద్యం వికటించి 12 ఏళ్ల బాలిక మృతి..!

BREAKING : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు..!

మరిన్ని వార్తలు