గొడకొండ్ల లో మాదారం యాదయ్య విగ్రహావిష్కరణ..!
చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదారం యాదయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,, మల్లోజు జగన్ చారి, ఆపిల్ డాక్టర్ పొట్టబోతుల విజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరణ నిర్వహించారు.

గొడకొండ్ల లో మాదారం యాదయ్య విగ్రహావిష్కరణ..!
ఆవిష్కరణ చేసిన బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, కె.వి.ఆర్…..
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదారం యాదయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,, మల్లోజు జగన్ చారి, ఆపిల్ డాక్టర్ పొట్టబోతుల విజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదారం యాదయ్య నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో సౌమ్యుడిగా, గ్రామంలోని అందరితో కలిసి మెలిసి తన పని తాను చేసుకుంటూ నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేవారని వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. క్రమశిక్షణ గల వ్యక్తిగా అందరి మన్ననలను పొందిన వ్యక్తిగ యాదయ్య గ్రామంలో అందరితో కలిసి మెలిసిపోయే వారన్నారు. వారు స్వర్గస్తులు కావడం పార్టీకి తీరని లోటు అన్నారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా దీవెనలు అందించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్యార పోశయ్య, రాములు,జిట్ట జగదీష్, మల్లోజు గోపి, జోర్రీ గల రామకృష్ణ, చేపూరి శ్రీనివాస చారి, బాదేపల్లి పుల్ రాజ్ గౌడ్ కటుకూరి నారాయణ గౌడ్, కోడిదూటి చంద్రయ్య, గజ్జి కృష్ణ, నరసింహ, కోడిదూటి లక్ష్మణ్, బాలేపల్లి నిరంజన్ గౌడ్,పుప్పల వెంకటేశ్వర్లు, ఏ.అబ్బయ్య జంగయ్య, కుటుంబ సభ్యులు మాదారం శేఖర్, మాదారం, వెంకటేష్ మాదారం జగదీష్, బాదేపల్లి లాలు, పాలకూర బిక్షపతి, రాజు. కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










