Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మాడ్గులపల్లి : మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
మాడ్గులపల్లి : మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
మాడ్గులపల్లి, మనసాక్షి:
నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలోని నల్లకుంట నుంచి తరలిస్తున్న మట్టి తరలింపును గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. మట్టిని గ్రామ సమీపంలో ఉన్న టోల్ ప్లాజా ఆవరణలో పూడిపోయటానికి తరలిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు అక్కడ కి చేరుకొని మట్టి తరలింపును నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి రైతులకు, గ్రామస్థులకు నచ్చచెప్పి పనులను నిలిపివేశారు. ఇట్టి విషయం పై ఇంచార్జి తహసీల్దార్ శివ శంకర్ ను వివరణ కోరగా మట్టి తరలింపు కు అనుమతులు ఉన్నాయని తెలిపారు.









