Miryalaguda : మున్సిపల్ చైర్మన్ కు బాల్యమిత్రుల సన్మానం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ కు బాల్యమిత్రులు ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. నల్గొండ జిల్లా డీసీసీ కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ చిన్ననాటి స్నేహితులు మున్సిపల్ చైర్మన్ సుధా బాల కృష్ణను మిర్యాలగూడలోని చింతపల్లిలో ఘనంగా సత్కరించారు.

Miryalaguda : మున్సిపల్ చైర్మన్ కు బాల్యమిత్రుల సన్మానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ కు బాల్యమిత్రులు ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. నల్గొండ జిల్లా డీసీసీ కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ చిన్ననాటి స్నేహితులు మున్సిపల్ చైర్మన్ సుధా బాల కృష్ణను మిర్యాలగూడలోని చింతపల్లిలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది ప్రత్యేకమైన రోజు తన భర్త స్నేహితులు ఇంత ప్రేమతో ఆత్మీయంగా సత్కరించడం సంతోషం కలిగించే విషయం అన్నారు. ‘స్నేహం’ అనేది ఎంతో పవిత్రమైన బంధం. బాల్య స్నేహం అంటే అది కల్మషం లేని అనుబంధం అన్నారు. మీరంతా ఒక కుటుంబ సభ్యురాలిగా భావించి ఈ గౌరవం ఇవ్వడం నాకు మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు.
మీ ప్రేమ, ప్రోత్సాహం ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తోందని, మున్సిపల్ చైర్మన్గా నా బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నానని’ తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, జర్నలిస్ట్ ఆజమ్ ఖాన్, షరీఫ్ భాయ్ ,
బలరాం, రమేష్, ఏజాస్, బక్కయ్య, మండేలా శ్రీను, పుప్పాల శ్రీను , మహేశ్, మస్తాన్ , ఇక్బాల్ , తస్లీమ్ , ఖాసీం , వాసు (డాడ్ ), గోగినేని వెంకట్ సూర్య నారాయణ , జానీ పాషా , కె. ప్రభాకర్, కూనల కృష్ణ, మల్లి (మల్లికార్జున్ ), సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.









