జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్.. తొలి రోజు ప్రశాంతం..!

Miryalaguda : గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్.. తొలి రోజు ప్రశాంతం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గ్రూప్ 3 పరీక్ష తొలి రోజు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రశాంతంగా జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని 28 పరీక్ష కేంద్రాలలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

మిర్యాలగూడ పట్టణంలోని నారాయణ జూనియర్ కళాశాల, కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల, సాకేత జూనియర్ కళాశాల, సినాప్సి జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య స్కూల్, అవంతిపురం లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్, శ్రీనివాస్ నగర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాల ను సబ్ కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు