Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డివిద్య

Rajendra Nagar : దేశ భవిష్యత్తు కోసం విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారాలి..!

Rajendra Nagar : దేశ భవిష్యత్తు కోసం విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారాలి..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

దేశ భవిష్యత్తు కోసం విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారి దేశానికి సేవాలు అందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు . గోల్కొండ కేంద్రియ విద్యాలయ 2 లో శుక్రవారం 52వ ప్రాంతీయ స్థాయి రాజ్య శాస్త్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని ఉత్సాహంగా జరిగింది.

47 పదాతి దళం నుంచి బ్రిగేడియర్ సంజయ్ వి. కులకర్ణి, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్, కెవిఎస్ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ జి. కృష్ణ వేణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటినుంచే ఆలోచించే విధానాన్ని అలవర్చుకోవాలన్నారు.

బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలని సూచించారు. బాల్యం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో వాటిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డి ఆర్ డి ఓ, ఇస్రో, ఐఐఎంఆర్, ఎస్ యు ఎల్ ఎస్ ఐ, ఐ ఐ ఆర్ ఆర్ సహా ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా పనిచేశారు.

ఈ విశిష్ట నిపుణులు పోటీ యొక్క కఠినమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్ట్‌లను మూల్యాంకనం చేశారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, సందర్శించిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు. కార్యక్రమంలో అనేక వినూత్న ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు.

ఏప్రిల్ 2025లో భువనేశ్వర్‌లో షెడ్యూల్ చేయబడిన జాతీయ స్థాయి పోటీకి ఎంపికైన వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు. ఉత్తమ ఎగ్జిబిట్లు ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు