వై ఎస్ ఆర్ సి పి రాజ్యసభ అభ్యర్థులు వీరే
వై ఎస్ ఆర్ సి పి రాజ్యసభ అభ్యర్థులు వీరే
అమరావతి, మనసాక్షి : ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21 తో పదవీకాలం ముగియనున్న ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి కి, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వివరాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి :
1. రూ. 30 తిరిగి ఇవ్వాలని అడిగినందుకు… కొట్టి చంపారు
2. కోడలికి పెళ్లి చేసిన అత్తమామలు, గిఫ్ట్ గా రూ. 60 లక్షల ఆస్తి









