తండ్రి కాదు వాడు మృగాడు.. కన్న కూతురిపై అఘాయిత్యం..!
వాడు ఒక తండ్రి కాదు.. రక్తసంబంధాన్ని, కన్నప్రేగును మరిచి.. కానీ పెంచిన కూతురిపైనే అఘాయితానికి ఒడిగట్టాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే భ భక్షుడిగా మారాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తండ్రి కాదు వాడు మృగాడు.. కన్న కూతురిపై అఘాయిత్యం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వాడు ఒక తండ్రి కాదు.. రక్తసంబంధాన్ని, కన్నప్రేగును మరిచి.. కానీ పెంచిన కూతురిపైనే అఘాయితానికి ఒడిగట్టాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే భ భక్షుడిగా మారాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల కథనం ప్రకారం నిందితుడైన తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా పెద్ద కుమార్తపై ఆ తండ్రి విచక్షణ కోల్పోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య నిలదీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. కుమార్తె పై భర్తే అగైత్యానికి పాల్పడ్డాడు అని తెలుసుకున్న భార్య తీవ్రంగా గొడవపడింది.
ఇంట్లో గొడవ పడి ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత బాధిత బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలికపై అఘాయిత్యం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృగంలా మారిన ఆ తండ్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
- Nalgonda : నల్గొండ జిల్లా భీమారంలో దారుణం.. గొర్రెల కాపరి దారుణ హత్య..!
- నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో అమానవీయ ఘటన.. మానవ మృగం, తండ్రి స్థానంలో ఉండి బాలికపై అఘాయిత్యం..!
- అమెరికాకు భారీ షాక్.. హార్మూజ్ పై ఖరీదైన, అత్యాధునిక డ్రోన్ మాయం..!
- Miryalaguda : మిర్యాలగూడలో ఆమానుష ఘటన.. 9ఏళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక వేధింపులు..!









