Breaking Newsక్రైంపెద్దపల్లి జిల్లా
Sudden Inspection : రెస్టారెంట్ లలో ఆకస్మిక తనిఖీలు.. జరిమానాలు..!
శుభ్రత లేని పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాలనను అసరించి ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం నగరంలోని వివిధ బేకరీలు, రెస్టారెంట్ లలో తనిఖీలు చేశారు.

Sudden Inspection : రెస్టారెంట్ లలో ఆకస్మిక తనిఖీలు.. జరిమానాలు..!
గోదావరిఖని, మన సాక్షి :
శుభ్రత లేని పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాలనను అసరించి ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం నగరంలోని వివిధ బేకరీలు, రెస్టారెంట్ లలో తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా దసరా దావత్ కిచెన్ , అన్ లిమిటెడ్ , బేకర్స్ డిలైట్ షాపులకు రూ 2,000/- చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీలలో నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్ , నాగ భూషణం , వార్డు ఆఫీసర్ రామకృష్ణ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.









