APS RTC : ఒకే టికెట్ తీసుకొని… రెండు బస్సుల్లో ప్రయాణం ఎలా..?
APS RTC : ఒకే టికెట్ తీసుకొని… రెండు బస్సుల్లో ప్రయాణం ఎలా..?
మన సాక్షి, వెబ్ డెస్క్:
సాధారణంగా బస్సు టికెట్ కొనుక్కుంటే బస్సు నెంబర్ తో సహా టికెట్ పై వస్తుంది. ఆ బస్సు తప్ప వేరే బస్సులో ప్రయాణించే అవకాశం ఉండదు. ఒకే టికెట్టు తీసుకుని ఒకే బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఓకే బస్ టికెట్ కొనుక్కొని రెండు బస్సుల్లో ఎలా ప్రయాణం చేస్తారు…?
కానీ ఏపీఎస్ఆర్టీసీ ఈ సరికొత్త తరహా పథకం ప్రవే ప్రవేశపెట్టనున్నది. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రయాణికులకు చేరువయ్యేందుకు కొత్త తరహాలో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నది.
ఈ తరహా పథకం దేశంలో ఎక్కడా కూడా లేదు. తొలిసారిగా ఈ పథకాన్ని ఏపీఎస్ఆర్టీసీ చేపట్టబోతుంది. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రాథమికంగా అమలుపై చర్చించారు. తొలి విడతలో ఎంపిక చేసిన రోడ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఓకే టికెట్ రెండు బస్సుల్లో ప్రయాణం :
మల్టీ లెగ్ ట్రావెల్ టికెట్ (ఎంఎల్ టి టి) పేరిట కొత్త ప్రయోగాన్ని ఏపీఎస్ఆర్టీసీ చేయబోతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నేరుగా బస్సులు లేని పక్షంలో ఒకే టికెట్ పై కనెక్టింగ్ బస్సుల్లో ప్రయాణించేలా అధికారులు ఈ పథకాన్ని రూపొందించారు.
విమాన ప్రయాణాలలో నేరుగా ఫ్లైట్ లేనప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. ఓకే టికెట్ పై కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆ విధంగానే ఏపీఎస్ఆర్టీసీ కూడా కొత్త తరహా పథకాన్ని తీసుకురానున్నది.
ఈ విధానం హైదరాబాదులోని మెట్రో ప్రయాణంలో కూడా ఉన్నది. గమ్యస్థానానికి చేరడానికి ఒకే మెట్రో టికెట్ తీసుకుంటే కనెక్టింగ్ ట్రైన్ ద్వారా గమ్యస్థానానికి చేసుకోవచ్చు. ఇక ఆర్టీసీ బస్సుల్లో కూడా గమ్యస్థానం చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ కొత్త తరహా విధానాన్ని అమలు చేయబోతుంది.









