Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

BREAKING : నేడు డీఎస్సీ ఫలితాలు.. లక్షలాది మంది ఎదురుచూపు..!

BREAKING : నేడు డీఎస్సీ ఫలితాలు.. లక్షలాది మంది ఎదురుచూపు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

లక్షలాది మంది ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు సోమవారం విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

11 గంటలకు ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. డీఎస్సీ పరీక్ష జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించారు. మొత్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు