తెలంగాణBreaking Newsసంక్షేమం

TG News : పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త..!

TG News : పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఆసరా పింఛన్ల లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులకు ఉన్నారు.

కాగా ప్రతినెల పంపిణీ సమయంలో పోస్ట్ ఆఫీస్ లలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వృద్ధులకు వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఉన్నట్లయితే వారికి వేలిముద్ర రాకపోవడంతో పింఛన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

దాంతో ప్రభుత్వం పింఛన్ దారులకు శుభవార్తను తెలియజేసింది. దాంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేలిముద్రలు పడని వారికి పంచాయతీ కార్యదర్శులు వేలిముద్రలు వేసి ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పింఛన్ దారులకు ఊరట కలిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు