KTR : బావమరిదితో లీగల్ నోటీసు పంపితే.. మాట్లాడను అనుకున్నావా..!
KTR : బావమరిదితో లీగల్ నోటీసు పంపితే.. మాట్లాడను అనుకున్నావా..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ వేదికగా పల అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పై ఆరోపణలు చేస్తే తనకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన మాట్లాడడం బంద్ చేస్తా అనుకుంటున్నా ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ చేసిన అంశాలు
బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ?
బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము
ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజం
శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ
ఢిల్లీ లో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే
ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది.
ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు.
LATEST UPDATE :
-
TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3వేల ఉద్యోగాల భర్తీ, మంత్రి పొన్నం వెల్లడి..!
-
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. వారికోసం తెలంగాణ దర్శిని..!
-
DEVARA : దేవర సినిమాలో మనోడు.. వెండి తెరపై మెరిసిన కురబలకోట కుర్రోడు..!
-
Bigg Boss Telugu 8 : సోనియా ఆ తప్పు వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయిందా..!










