District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోళ్లు అలా చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోళ్లు అలా చేయాలి..!
జగిత్యాల, మన సాక్షి :
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి కోతలు ప్రణాళికా బద్ధంగా జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేరకు టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగుల, వెయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, కొనుగోలు సిబ్బందికి అవసరమైన మేరకు శిక్షణ అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కాంట చేయాలని ఎదురుచూసే పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్ ఎంట్రీ జరిగేలా సిబ్బంది నియమించుకోవాలని తెలిపారు. 2025 వానాకాలం సీజన్ నందు ధాన్యం నగదు, బోనస్ నగదు 48 నుంచి 72 గంటల లోగా రైతులకు ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్ మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను వరి కోతల కంటే ముందుగానే ప్రారంభించాలని అన్నారు.
దీపావళి తర్వాత వరి కోతలు వేగం కానున్న నేపథ్యంలో జిల్లాల్లో గన్ని బ్యాగుల, ధాన్యం రవాణా ఏర్పాట్లు, ధాన్యం సెంటర్ లలో ఇన్ ఫ్రా సౌకర్యాల కల్పన పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
దాన్యం కొనుగోలు క్రమ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు.
లోతట్టు ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ వద్దని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన వస్తువులు కల్పించాలని అన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒకే చోట కొనుగోలు చేస్తే రైతులకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని, సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా రవాణా చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ కన్నం హరిణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రఘువరన్, డిసివో మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేంద్ర రెడ్డి, డిఏం జితేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : ఈ ముఠా మామూలోల్లు కాదు.. అమాయక ప్రజలే వారి టార్గెట్..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!
-
Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!
-
Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి..!
-
PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!









