Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!

Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!

పెన్ పహాడ్ , మన సాక్షి :

రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్ద మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ అన్నారు. మండల పరిధిలోని అనంతారం నారాయణ గూడెం గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలిపినారు. సన్న వడ్లకు 500 బోనస్ చెల్లిస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారన్నారు. మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ప్రకటించిన మేరకు దాన్యములో తేమశాతం ఉండేలా రైతులు చూసుకొని తీసుకురావాలని తెలిపారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ మామిడి శ్రీనివాస్, సీఈవో సైదులు, పిఎసిఎస్ డైరెక్టర్స్ శంకరమద్ది పుల్లారెడ్డి ,భూక్య శంకర్, బైరెడ్డి రామిరెడ్డి, నకిరేకంటి బజార్ ,దొంత గాని శ్రీను, ఎగ్గడ్డి పద్మ, మేకల శ్రీనివాస్, లక్కపాక అలివేలు, సైదులు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, గజ్జల ధర్మారెడ్డి, గజ్జల శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి గోవర్ధన్ రెడ్డి, షేక్ మల్సూర్, రైతు సోదరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి..!

  3. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు