Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ఎరుపెక్కిన మిర్యాలగూడ.. కమ్యూనిస్టుల భారీ ర్యాలీ..!

Miryalaguda : ఎరుపెక్కిన మిర్యాలగూడ.. కమ్యూనిస్టుల భారీ ర్యాలీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఎరుపెక్కింది. సిపిఎం నల్లగొండ జిల్లా మహాసభల సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాగర్ రోడ్డులోనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్ఎస్పి క్యాంపు బహిరంగ సభ వరకు సాగింది.

బహిరంగ సభలో ఆ పార్టీ సీనియర్ నేతలు బివి రాఘవులు, చెరుపల్లి సీతారాములు, జూల కంటి రంగా రెడ్డి, మల్లు లక్ష్మి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

బహిరంగ సభలో డబ్బికార్ మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, వీరె పళ్లి వెంకటేశ్వర్లు, రెమడాల పరశురాములు, రవి నాయక్, వీరాచారి, మల్లు గౌతమ్ రెడ్డి, పాండు, పుచ్చకాయల నర్సిరెడ్డి, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు