TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం
Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!
Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా నిధులను విడుదల చేసింది. ఆయా జిల్లాల అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో త్వరలో పంటలు నష్టపోయిన రైతుల ఖాతాలలో పరిహారం నిధులు జమ కానున్నాయి.









