Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్..!

Nalgonda : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్..!
నల్లగొండ, మన సాక్షి :
అద్దంకి బైపాస్ లెప్రసి కాలనీ దగ్గర కనకదుర్గ రైస్ మిల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి వైపు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొంది. ఢీకొన్న ప్రభావంతో డీసీఎం డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ కాబిన్ లో ఇరుక్కోవడాన్ని గమనించిన మెడికల్ టెక్నిషియన్ కిరణ్ , పైలట్ అజాజ్ లు. వెంటనే 108 అంబులెన్స్ లో ఉండే పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ సహాయం తో కాబిన్ లోనే ఆక్సిజన్ అందిస్తూ శ్వాసనిచ్చి సాయం చేశారు.
స్థానికులు టాక్టర్ సహాయంతో తాడు కట్టి క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్ని బయటకు తీశారు. క్షతగాత్రుడిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
MOST READ :
-
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!
-
IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!
-
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!









