ఆంధ్రప్రదేశ్Breaking News
పుష్పయాగంతో శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి..!
పుష్పయాగంతో శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి రథసప్తమి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామికి పుష్పయాగం నిర్వహించారు. స్వామివారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించి హోమాలు తోమాల సేవ ఉంజల సేవ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉత్సవాలు ముగింపు దశకు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి బటర్,కులశేఖర్ బటర్, మల్లికార్జున, శ్రీనివాసులు స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాత్రి ఎగువ పాల్యం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు.
MOST READ :









