TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక ప్రకటన జారీచేసింది. ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయడంతో పాటు పదవ తరగతి ఫలితాలు కూడా ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఈనెల 22వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు.
హైదరాబాదులోని నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొననున్నారు. ఇంటర్ రిజల్ట్ కోసం అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in చూడవచ్చు.
MOST READ :
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!
-
Leopard : చిరుత పులి మృతి కేసు కలకలం.. ఫారెస్ట్ కార్యాలయం ముట్టడించిన మహిళా రైతులు..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!









