బాలుడి ప్రాణం తీసిన బర్రె..!
బాలుడి ప్రాణం తీసిన బర్రె..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కె గ్రామానికి చెందిన మారుతీ, పార్వతి. దంపతులకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు రాజు(9) స్థానికంగా నాల్గవ తరగతి చదువుతున్నాడు.
తరుచుగా వారి బర్రె పై కూర్చొని పంట చేనుకి వెళ్తుంటాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వెళ్లాడు. సాయంత్రం గేదెకు కట్టిన తాడు తన నడుముకు కట్టుకొని దాని దగ్గరకు వెళ్లగా ఒకేసారిగా కిందపడేసింది.
అంతటితో ఆగకుండా నేలపై లాక్కొని రాళ్లు, ముళ్లలో నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పంట చేనులోనే ఉన్న కుటుంబీకులు బీదర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చిన్న వయస్సులోనే కొడుకు చనిపోవడం చెందడం తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగిల్పింది.
LATEST UPDATE :
DEVARAKONDA : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!
HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!
మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!









