రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ..!
Miryalaguda : ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని వ్యతిరేకిస్తూ ఎం సి పి ఐ (యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వాస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి సైదమ్మ మాట్లాడుతూ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో 1500 మంది ప్రజలు చనిపోయారని అన్నారు.
అమర వీరులకు సంస్మరణ దినంగా కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎం సి పి ఐ యు జిల్లా నాయకులు మచ్చ సైదులు, భరత్, కిరణ్, ముత్తయ్య, జ్యోతి, రవి, ఇమ్మానియేల్, మౌనిక, చరణ్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









