Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!
Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
స్థానిక సంస్థల ఎన్నికల లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నేలకొండపల్లి ఎంపీడీఓ యం.యర్రయ్య తెలిపారు. మండలం లోని ఓటర్ల జాబితా ప్రక్రియ పనులను మండల పరిషత్ కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామంతా సిద్ధంగా ఉన్నట్లు పేర్కోన్నారు. 18 ఎంపీటీసీలకు గాను 94 పోలింగ్ కేంద్రాలను, 32 గ్రామ పంచాయతీలకు 300 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు పేర్కోన్నారు. ఎంపీటీసీలకు మండల కేంద్రంలోని ఐదు ప్రభుత్వ కార్యాలయాలలో నామినేషన్ల కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.
అదే విధంగా పంచాయతీ పాలకవర్గాలకు నామినేషన్ల కు సంబంధించి 10 నామినేషన్ల కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మండలం లోని ఎంపీటీసీ, సర్పంచ్లకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మండలంలో ఎన్నికల కు సంబంధించిన పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని పేర్కోన్నారు.
MOST READ :
-
Tandel : తండెల్ ఎలా ఉందో తెలుసా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Penpahad : కాలేశ్వరం జలాలు రాక ఎండిన పంట పొలాలు.. పశువుల మేపుతున్న రైతులు..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!
-
Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!









