క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : కారు ఢీకొని వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ : కారు ఢీకొని వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం ఉదయం ఆలగడపకు చెందిన ఇంద్ర పల్లి సైదులు (42) రోడ్డు దాటుతుండగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై కారు ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వీరాంజనేయులు పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ALSO READ : 

NARAYANPET : కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంటే.. MV act ప్రకారం చర్యలు..!

Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update

మరిన్ని వార్తలు